బుల్లితెరపై బిగ్బస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వారాలు ఎలిమినేషన్స్ జరిగి ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. అయితే తాజాగా నాలుగో వారం ఎలిమినేషన్లు ఒక షాకింగ్ ట్విస్ట్ బిగ్బాస్ పెట్టాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈసారి బిగ్ బాస్ నుంచి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కొత్త హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్, శుభశ్రీ ఉన్నారు.
శుభశ్రీ, యావర్ మొదటి రెండు స్థానాల్లో ఓట్లను దక్కించుకోగా రతిక రోజ్, టేస్టీ తేజ చివరి స్థానాల్లో ఉన్నారు. ఎప్పటిలాగే సాధారణ ఎలిమినేషన్స్ జరిగితే ముందుగా టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. అయితే ఈ సీజన్ ఉల్టా పట కాన్సెప్ట్ కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ డబల్ ఎలిమినేషన్ లో టేస్టీ తేజ తో పాటు రతికా రోజ్ కూడా ఎలిమినేట్ అవ్వబోతుందట. హౌస్ లో బ్యూటిఫుల్ స్నేక్ ల ఆట ఆడుతున్న రతిక ఎలిమినేట్ అయితే కనుక బిగ్ బాస్ ఆడియన్స్ సంతోషించడం ఖాయం.
బిగ్బాస్కు కావాల్సినంత కంటెంట్ రతిక ఇచ్చినా ఏకంగా మనుషులతోనే గేమ్ ఆడేస్తుంది.. రతిక పాప. నీ ఆట నువ్వు ఆడు.. మనుషులతో ఆడుకోకు అంటూ ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే మనుషులతోనే ఆడుకుంటూ ఎప్పటికప్పుడు అందరినీ చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రశాంత్, యావర్ ఇద్దరితో ఆట ఆడేసుకుంటుంది రతిక. వీరిద్దరిని కవ్వించి, ప్రేమ పాటలు నేర్పించి చివరికి వారికి వెన్నుపోటు పొడుస్తుంది. ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో రతిక ఎలిమినేట్ అయితే బాగుండు అని చాలామంది ప్రేక్షకులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.