దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి అక్కడ తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్.. దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది జాన్వి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను వివరించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని అశ్లీల తరహా వెబ్సైట్లో పెట్టారని ఆ విషయం తెలిసి నేను షాక్ అయ్యానని వివరించింది.
కెమెరాలు, ఫోటోగ్రాఫర్స్ చిన్నతనం నుంచి నా జీవితంలోనే భాగం.. పదేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి నా ఫోటోలు ఆన్లైన్లో దర్శనమిచ్చేది. ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నానంటూ వాటిని ప్రచురించారు. నా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వాటిని చూసి నన్ను దూరం పెట్టేవారు. నాపై జోక్స్ వేసేవారు. కష్టపడకుండా డబ్బు సంపాదిస్తావా అంటూ కామెంట్స్ చేసేవారు. వారందరూ ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారు.. నన్ను ఎందుకు జెడ్ చేస్తున్నారో.. అంటూ వివరించింది. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు అంటూ వివరించింది.
ఇక టెక్నాలజీ వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మార్ఫింగ్, ఫేక్ ఫొటోస్ ఎక్కువైపోయాయి. మార్ఫింగ్ ఫోటోలు చూసి నిజమని జనం నమ్ముతారేమో అన్న భయం నాలో ఉంటుంది. ఆ విషయం నన్ను ఎంతో బాధ పెడుతుంది. టీనేజ్లో ఉన్నప్పుడు నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆశ్లీల వెబ్సైట్లో ఉపయోగించారు. ఆ విషయం తెలిసి నేను కంగారు పడ్డ అంటూ ఆమె చెప్పకొచ్చింది. ప్రస్తుతం జాన్వి కపూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.