స‌హ‌సం చేస్తున్న రష్మిక మాజీ లవర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే పోటీ పెట్టుకున్నాడుగా..!!

రష్మిక మందన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో నేడు విడుదలైంది. ఇదే సమయంలో రక్షిత్ సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను కన్నడ వర్షన్‌ను హైదరాబాద్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. అయితే కన్నడలో విజయ్ దేవరకొండ సినిమాకి పోటీగా ఇప్పుడు రక్షిత్ శెట్టి సినిమా కూడా రిలీజ్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. హేమంత్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా.. ఇక హేమంత్ రాజ్, రక్షిత్ శెట్టి కాంబోలో ఇంతకుముందు గోధి బన్న సాధారణ మైకట్టు (జిపిఎస్ఎమ్) సినిమా వచ్చి కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో సుమారు 8 ఏళ్లు తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి.