సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో ఇటీవల భారీ హిట్ అందుకున సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేని రజనీకాంత్కు ఈ సినిమాతో భారీ కమ్ బ్యాక్ వచ్చింది. ఈ మూవీ ఏకంగా రూ.650 కోట్ల భారీ కలెక్షన్లను వసులు చేసి పాన్ ఇండియా లెవెల్లో బీభత్సం సృష్టించింది.
రజిని సినీ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ హిట్స్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తమిళ్ హీరోయిన్ అమలాపాల్ కు రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చాడంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవల కోలీవుడ్ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ రజనీ కూతురు ఐశ్వర్య కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తన అల్లుడు ధనుష్ తో అమలాపాల్ క్లోజ్ గా ఉండడం వల్లే కూతురుతో విడాకులు తీసుకున్నాడని రజనీకాంత్ భావించాడట. దాంతో రజినీ ఆమె ఇంటికి వెళ్లి మరి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు అంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.