పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా పై రోజు రోజుకి హైప్స్ పెరుగుతున్నాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్. ఈ మూవీలో అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడట. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి ప్రామిసింగ్ యాక్టర్స్ సినిమాలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీని విమర్శించే శ్రీ రెడ్డి.. ఈ మూవీ గురించి ఓ స్టోరీ పోస్ట్ చేసింది.
సుజిత్ డైరెక్షన్లో ఇంతకుముందు వచ్చిన ‘ సాహో ‘ లో మొదట్లో దొంగతనం సీన్ జరుగుతున్నప్పుడు… ఒకతను రోడ్ పక్కన కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు. ఆ అడుక్కునే వాడి కొడుకే OG లో పవన్ కళ్యాణ్.. ట్విస్ట్ అదిరిపోయింది కదా అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను బండ బూతులలో ఆడేసుకుంటున్నారు.