బిగ్‌బాస్ హౌస్‌లో పల్లవి ప్రశాంత్ ప్రేమాయణం.. పిచ్చోడిపోతాడేమో!!

బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీసన్ 7 ప్రారంభమయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ నెల 3 న ఎంత అట్టహాసంగా ఆరంభమయింది. నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించడం ఇది వరుసగా ఐదోసారి. ఈ సరి బిగ్ బాస్ షో లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. గత ఆరు సీసన్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. ఇప్పటి వరకు అత్యధికంగా 21 మంది ఒక బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నారు. ఈ సాజన్ లో ఇంత తక్కువ మంది పాల్గొనడానికి కారణం యాజమాన్యం ఇంకా తెలియపరచలేదు. చివరి నిమిషంలో కొందరు కంటెస్టెంట్లు తప్పుకోవడమే కారణం అని సమాచారం.

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. మొదటిరోజు హోస్ట్ నాగార్జున 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసి హౌస్ లోపలికి పంపించారు. ఐతే షో మొదలైన వారం రోజులకే మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రేమాయణం మొదలుపెట్టాడు. కో కంటెస్టెంట్ రితిక తో తెగ సరసాలాడేస్తున్నాడు. ఆమె కూడా ప్రశాంత్ అటెంషన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఐతే ఈ కథ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. రైతు బిడ్డగా లోపలి వెళ్లిన ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయితో కలిసి బయటకు వస్తాడా, లేక ప్రేమ పిచోడిలా వస్తాడో వేచి చూడాల్సిందే.

వీళ్ళ కథ ఇలా ఉండగా….బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మరో సంఘటన దుమారం లేపుతోంది. కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ మెడకు రెండు వైపులా పంటి గాట్లు ఉన్నట్టు గుర్తించింది రితిక. ఈ గాట్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటూ డిస్కషన్ మొదలయింది బిగ్ బాస్ హౌస్ లో. ఈ గాట్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించగా “నేను పడుకొని లేచేసరికి ఉన్నాయ్ …నన్ను ఇన్వొల్వె చెయ్యకండి” అంటూ సైడ్ ఐపోయాడు గౌతమ్. ఐతే శుభ శ్రీ రాయగురు మాత్రం ఆ లిప్ స్టిక్ తనది కాదు అంటూ గుమ్మడికాయల దొంగలా భుజాలు తరుముకుంటుంది.