ఆ తెలుగు స్టార్ హీరో మూవీలో లైంగిక వేధింపులకు గురైన నయన్‌.. ఏం జ‌రిగిందంటే..!!

స్టార్ బ్యూటి నయనతార దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసింది. టాలీవుడ్, కోలీవుడ్‌ లోనే కాక ఇటీవల తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక దీనివెనుక ఓ బలమైన కారణం ఉందట. ఆ కార‌ణంగానే న‌య‌న్‌ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్లు అవుతుంది.

ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. నయనతార జంటగా నటించిన మూవీ యోగి. గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీ టైంలో నయనతార లైంగిక వేధింపులను ఎదుర్కొందని.. సినిమా ఆడియో లాంచ్ వేడుకల్లో ఒక రాజకీయ నాయకుడు నయనతారను సెక్సువల్గా హెరాస్‌ చేశాడని.. ఆ సమయంలో ఆమె ఒంటరిగానే బాధపడుతూ చాలా ఏడ్చిందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ కారణంతోనే ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకూడదని నయనతార నిర్ణయించుకుందట. కేవలం సినిమాల్లో నటించడం వరకే తన పనని ప్రచార బాధ్యత మొత్తం చిత్ర బంధందేఅట‌. సినిమాను అంగీకరించే ముందే టీం తో మాట్లాడి వారు దానికి ఓకే చేస్తేనే సినిమాలో నటిస్తుందట. ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అని సెర్చింగ్ స్టార్ట్ చేశారు నేటిజన్‌లు.