ఇటీవల షారుక్ హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన బాలీవుడ్ మూవీ జవాన్. ప్రస్తుతం వెయ్యికోట్ల కలెక్షన్ల వైపుగా దూసుకుపోతుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. నయనతార క్యారెక్టర్ కు నడివి తక్కువగా ఉందని అట్లీ తనకు చెప్పిన విధంగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నయనతార రోల్ రూపొందించలేదని అట్లీ పై నయన్ కోపంగా ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక తాజాగా అట్లీ బర్త్డే సందర్భంగా నయనతార అతనికి పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ ఈ పుకార్లకు చెక్ పెట్టింది. అయితే షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ చూస్తే మాత్రం నిజంగా నయనతార తన పాత్ర విషయంలో అప్సెట్ అయిందేమో అనిపిస్తుంది. జవాన్ సినిమాలో సింగల్ మదర్ నర్మదా చాలా బలమైన పాత్ర. ఆ పాత్ర చాలా అద్బుతంగా ఉంటుందని భావించాను.. కానీ దురదృష్టవశాత్తు నర్మదకు తక్కువ స్క్రీన్ టైం ఉంది అని ట్విట్ చేశాడు.
ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ షారుఖ్ ఖాన్ ఈ మెసేజ్ పెట్టారు. దీన్ని బట్టి నయన్ పాత్ర నడివి తగ్గడం పై షారుక్ ఖాన్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక నయన్ ప్రస్తుతం నయనతార తమిళ్ ఫేమస్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ డైరెక్షన్లో మన్నగట్టి మూవీలో నటిస్తుంది. దాంతో పాటు జయం రవి హీరోగా ఐ అహ్మద్ డైరెక్షన్ చేస్తున్న మూవీ లో కూడా నయన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.