ఎప్పుడైనా నీ భార్య‌ చెప్పులు మోసావా.. హౌస్ లో 13 మంది ఉన్నారు ఒకళ్ళే లేరు అంటూ ఫైర్‌ అయినా నాగార్జున..!!

ప్రస్తుతం బిగ్ బాస్ 7 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్లతో కళకళలాడుతున్న హౌస్‌లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. శోభ శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని, రతిక రోజ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.

ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్లకి ఓట్లు వేసి ఎలిమినేషన్ నుంచి ఎవరిని కాపాడారో ఈరోజు చూడాలి. ఇదిలా ఉంటే.. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా శనివారం నాగార్జున హౌస్ మేట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఈ సీజన్ స్టార్ట్ అయిన తరువాత మొదటి శనివారం అయిపోయింది. మరి హౌస్ మేట్స్‌పై నాగార్జున రియాక్షన్ ఎలా ఉందంటే..”ఇప్పుడు హౌస్ లో నాకు తెలిసి 13 మందే ఉన్నారు.

కంప్లీట్ గా ఇంగ్లీషులో మాట్లాడే కిరణ్ రాథోడ్‌ని కౌంట్ చేయడం లేదని సెటైర్లు వేశాడు నాగార్జున. ఇక ఇంట్లో ఎప్పుడైనా మీ ఆవిడ చెప్పులు మోసావా సందీప్ అని కామెడీ చేశాడు. ఈ విషయం మీ వైఫ్ కు తెలిస్తే అని అనేసరికి హౌస్ మేట్స్ అందరూ నవ్వారు. మొదటినుంచి కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఎప్పుడు టాప్ 5 కి పంపించరు అంటూ శోభ పై సీరియస్ అయ్యాడ నాగార్జునాష‌. ఇక ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది తెలియాలంటే ఈరోజు బిగ్ బాస్ 7 చూడాల్సిందే.