నా కొడుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అభిషేక్ పిక్చర్స్ పై ఫైర్ అయున విజ‌య్ తండ్రి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రెండు సినిమాల ఫ్లాపుల తరువాత ఎట్టకేలకు ఖుషి సినిమాతో హిట్ కొట్టి విజయ్ తన సత్తా చాటుకున్నాడు. సెప్టెంబర్ 1వ‌ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సక్సెస్ అభిమానులతో పంచుకోవాలని ఉద్దేశంతో హీరో విజయ్ 100 కుటుంబాలకు కోటి రూపాయలను బహుమతిగా ఇస్తున్నానని వెల్లడించాడు. ఇదిలా ఉండగా విజయ్ ఈ ఆఫర్ ప్రకటించగానే అభిషేక్ పిక్చర్స్ వేదికగా.. మా డిస్ట్రిబ్యూటర్స్ రూ. 8 కోట్లు నష్ట పోయారు.. మీ మంచి మనసుతో వారిని కూడా ఆదుకోవాలంటూ ట్వీట్ చేశారు.

తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు స్పందించాడు. అభిషేక్ నా కొడుకుని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు.. ఇలా చేయడం కరెక్ట్ కాదు? వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పారితోషికంలో సగం ఇచ్చాడు.. ఇంత కన్నా ఏమి చేయాలి. అభిషేక్‌తో నా కొడుకు ఇక సినిమాలు చేయడంటూ గోవర్ధన్ రావు క్లారిటీ ఇచ్చాడు.