ఏఎన్ఆర్ శ‌త జయంతి వేడుకల్లో జయసుధ పై ఫైర్ అయిన మోహన్ బాబు.. కారణం ఇదే..!

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శ‌త‌జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుక‌ల సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు, సినీ ప్ర‌ముఖులు అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, రామ్‌చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులంతా హాజరై వేడుకకు మరింత గ్రాండ్ లుక్ ఇచ్చారు.

ఈ వేడుకల్లో భాగంగా పాల్గొన్నవారంతా అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన సాధించిన ఘనతల గురించి, సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉండడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంతో మంది నటులను పరిచయం చేశాడు. ఇక నాగేశ్వరరావు గురించి సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఉండగా జయసుధ మాత్రం ఫోన్లో బిజీగా ఏదో చూస్తుంది.

దీంతో పక్కనే ఉన్న మోహన్ బాబు ఆమెపై సీరియస్ అయ్యి చేతిలో నుంచి ఫోన్ లాకుందామని ప్రయత్నించాడు. అయితే మొదట జయసుధ సీరియస్ గా లుక్ ఇచ్చిన ఫైనల్ గా నవ్వుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.