దర్శకుడు త్రివిక్రమ్ కారణంగా ప్లాప్‌ అయినా మెగాస్టార్ సినిమా ఏమిటో తెలుసా..!?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి.. ఒక మామూలు హీరో నుంచి టాలీవుడ్ ని శాసించే మెగాస్టార్ గా ఎదిగాడు చిరు. గ‌తంలో చిరంజీవి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దానికి ప్రత్యేక ఉదాహరణ బోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ అవటమే.

అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరు హీరోగా జై చిరంజీవ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా భూమిక మరియు సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను కె విజయభాస్కర్ తెరకెక్కించుగా త్రివిక్రమ్ కథను అందించాడు.

2006లో రిలీజ్ అయిన జై చిరంజీవ సినిమా అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. చిరంజీవి- అశ్విని దత్ కాంబోలో వచ్చిన నాలుగో సినిమా కూడా ఇదే. అయితే జై చిరంజీవ సినిమా అట్టర్ ప్లాఫ్ అవటంపై అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా అమెరికా వెళ్ళాము.. కానీ అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ అమెరికా రాలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

అలాగే హీరోయిన్ స‌మీరారెడ్డి ఐరన్ లెగ్ అనీ ఆమెను ఈ సినిమాలో పెట్టుకోవాలని త్రివిక్రమ్ చెప్పినట్లు వివరించారు అశ్విని దత్. ఆమె కోసం ప్రత్యేకమైన సీన్లు రాశానని త్రివిక్రమ్ వెల్లడించినట్లు తెలిపారు. కానీ సమీరా రెడ్డి చేసిన సీన్లు అస్సలు బాగాలేవు.. చివరికి జై చిరంజీవ సినిమా అట్టర్ ప్లాప్ అయిందని అశ్విని దత్ పేర్కొన్నారు.