ఎన్నో మంచి సినిమాలకు నో చెప్పిన మీనాక్షి.. కారణం ఇదే..!!

హిట్ 2 ‘ తో తెలుగు తెరపై ప‌తిచ‌య‌మైంది మీనాక్షి. మొద‌టి సినిమాతో నే హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘ గుంటూరు కారం ‘ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దర నాయకులు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ‘ అట్టా.. సూడకే అంటూ ‘ ఖిలాడి ‘ లో రవితేజ సరసున నటించింది. తన డాన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ తో ‘ మట్కా ‘ సినిమాలోను నటిస్తోంది.

నోరా ఫతేహి మరో నాయక. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాకి వరుణ్ కుమార్ దర్శకుడు. ఈమె మిస్ ఇండియా టైటిల్ (2018) గెలుచుకున్నాక యాక్టింగ్ లోకి అడుగు పెట్టింది.’ ఇచ్చట వాహనాలు నిలపరాదు ‘ తన మొదటి సినిమా. ఇక విశ్వక్సేన్ పదో సినిమాలోను మీనాక్షి నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మీనాక్షికి ట్రిప్పులంటే… అడవులే గుర్తు చేసుకుంటుంది. షూటింగ్లో బ్రేక్ వస్తే స్నేహితులతో కొండలు, అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తుంది.

అర్ధనగ్నంగా కనిపించే.. కెమెరా ముందు ఇబ్బంది పడే సీన్లు ఏమైనా ఉంటే నో చెబుతుంది. ఆ కారణంతో ఎన్నో మంచి కథల్ని వదులుకుంది. ‘ టాలీవుడ్ లో అగ్ర హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి. చాలా హ్యాపీ. అవకాశాలు ఎన్నున్నా వాటిలో ఏది ఎంపిక చేసుకున్నామనేదే ముఖ్యం’. టాలీవుడ్ లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. పరిశ్రమ నాకు తల్లి లాంటిది. హిట్ 2 ఒకే అవకాశం కెరియర్ ని మలుపు తిరిగేలా చేసింది. అందులో ‘ ఉరికే… ఉరికే… పాట నాకు చాలా ఇష్టం’. అంటూ ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తెలిపింది.