శ్రీలీలకు ఎసరు పెడుతున్న‌ మీనాక్షి చౌదరి.. ఏం చేసిందంటే..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ గుంటూరు కారం ‘. ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా.. రెండవ కథానాయకగా శ్రీ లీలను ఎంపిక చేశారు. అయితే తరువాత పూజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో శ్రీ లీలను మెయిన్‌ హీరోయిన్ గా.. మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా ఓకే చేశారు.

తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే పాత్ర కోసం ఫైనల్ చేశారని.. రెండో కథానాయకగా శ్రీ లీలను పెట్టినట్టు సమాచారం. ఇక దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ముందుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీయాలనుకున్నా కొన్ని కారణాలవల్ల టాలీవుడ్‌కే పరిమితమైంది. య్ంగ్‌ బ్యూటీ శ్రీ లీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అందులో గుంటూరు కారం ఒకటి. పెళ్లి సందడితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినీ రంగంలో దూసుకుపోతుంది.