ఆ దివంగత హీరోయిన్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ తమన్న..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వారిలో అతి తక్కువ మంది ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో దివ్యభారతి ఒక్కరు. 1980 – 90లో అప్పటి స్టార్ హీరోల అందరి సరసన నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది దివ్యభారతి. అంత తక్కువ సమయంలో అన్ని సినిమాల్లో నటించిన ఘనత కేవలం ఆమెకే దక్కింది. అలాంటి అరుదైన ఘనత పొందిన ఆమె హీరోయిన్గా ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో చనిపోయింది.

ఆమె మరణం ఇప్పటికీ కూడా అంతుచిక్క‌ని రహస్యంగానే ఉంది. తన అపార్ట్మెంట్ నుంచి కింద పడిపోయి చనిపోయిన దివ్యభారతి కేసు చాలాకాలం కొనసాగింది. మొదట.. భర్త పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆమె ప్రమాదవశాత్తు మరణించింది అంటూ పోలీసులు పేర్కొన్నారు. కానీ బాలీవుడ్ వర్గాల‌లో మాత్రం ఇప్పటికీ కూడా దివ్యభారతి మరణం గురించి ఎన్నో రకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దివ్యభారతి మరణం గురించి ఓ సినిమా రూపొందించేందుకు మలయాళ దర్శకుడు అరుణ్ గోపి సిద్ధమయ్యాడు.

దిలీప్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తున్న బాంద్రా అనే మూవీలో దివ్యభారతి బయోపిక్‌ని చూపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. బాంద్రా సినిమాలో దివ్యభారతి పాత్రలో ముల్కీ బ్యూటీ నటించబోతుంది అంటూ మలయాళ ఇండస్ట్రీలో టాక్. పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి కథ బాంద్రా పేరుతో అన్ని భాషల్లో తీసుకువచ్చేందుకు మేకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు చూడని తెలియని సీక్రెట్స్ ఏవైనా ఈ సినిమాలో చూపిస్తారేమో అని దివ్యభారతిని అభిమానులంత‌ ఎదురుచూస్తున్నారు.