సరైన నిర్ణయం తీసుకున్న లావణ్య.. ఫిదా అవుతున్న మెగా ఫాన్స్..

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా వెళ్తుంది కాబట్టి ఓ రకంగా పెద్ద బరువైన బాధ్యతలను చేపట్టినట్టే. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలను ప్రదర్శించడం అంటే ఆమె సాహసం చేయడమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా ఆ పేరు మెగా ఫ్యామిలీకి కూడా వస్తుంది. అయితే మెగా ఫ్యామిలీకి మంచి పేరు తేవాలని ఉద్దేశంతోనే ఆమె కూడా వేసే ప్రతి అడుగు ఆచితూచి డెసిషన్ తీసుకుంటుందట.

వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం అయ్యాక అంతకుముందు ఆమె ఒప్పుకున్న చాలా సినిమాలను రద్దు చేస్తుందని టాక్. ప్రస్తుతం ఆమెకు వస్తున్నా అవకాశాలను కూడా పక్కన పెట్టేసిందట. తమిళ్‌లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల క్రితం ఓకే చేసిన లావణ్య.. షూటింగ్ మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానున్న టైం లో ఈ సిరీస్ లో నేను నటించానని మొహంపై చెప్పేసిందిట. స్కైలాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విశ్వక్ ఖండేరావు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లో హీరోయిన్ పాత్ర కాస్త బోల్డ్ గా ఉండబోతుందని రొమాన్స్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

కొద్ది రోజులో మెగా ఇంటికోడలుగా అడుగు పెడుతున్న తను ఇలాంటి సమయంలో అలాంటి క్యారెక్టర్స్ లో నటించడం కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని దర్శక, నిర్మాతలను పిలిచి మరి వివరించిందట. ఆమె తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేసిందట. నిశ్చితార్థమైన తర్వాత తాను మెగా కోడలినని కొణిదల వారి కోడలిగా ఇలాంటి కథల్లో నటించడం కరెక్ట్ కాదని ఆమె చెప్పిందట. దీంతో ఆమె నిర్ణయాన్ని కాదనలేక వారు కూడా సైలెంట్ అయిపోయారని సమాచారం. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ ప్రస్తుతం లావణ్య నిర్ణయానికి ఫిదా అవుతున్నారు. అమ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.