సూపర్ సక్సెస్ తో ‘ఖుషి’ ఖుషిగా చిత్ర యూనిట్…యాదాద్రీశుడి సేవలో చిత్ర యూనిట్‌..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన సినిమా ఖుషి.. దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వీకెండ్స్ లోనూ ఎవరు ఊహించిన విధంగా భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత విజయ్ దేవరకొండ ఖాతాలో మంచి హిట్ పడటమే కాకుండా హైయెస్ట్ కలెక్షన్ ను అందుకుంటుంది.

ఖుషి సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా ఉంది విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావటంతో అటు డైరెక్టర్ ఇటు సమంత- విజయ్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఖుషి సినిమా యూనిట్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంది. హీరో విజయ్ దేవరకొండ తో పాటు ఈ సినిమా టీం స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రత్యేక పూజలుు పాల్గొంది.

ఈ సందర్భంగా వారికి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి అర్చకులు ఆశీర్వాదం అందించి ఆలయ సంప్రదాయ ప్రకారం ఖుషి సినిమా యూనిట్ కి స్వాగతం పలికారు.. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షలను సాధించింది. లైగ‌ర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని ఎవరు ఊహించలేదు.

ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఎక్కువగానే కలెక్షన్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి ఎక్కువగానే కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం రెండ్రోజుల్లోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది. స్టార్ హీరో, మీడియం హీరోకు కూడా వన్ మిలియన్ డాలర్ కబ్ లో చేరేందుకు ఓవర్సీస్ లో వారం రోజులు పడుతుంది. కానీ ఈ సినిమాకు మాత్రం కేవలం రెండు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్లను రాబట్టేసింది.

అటు ఈ సినిమాతో సమంత మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కు లేని రికార్డ్ అందుకుంది సామ్. ఆమె నటించిన 17 సినిమాలు మిలియన్స్ నటించిన 17 చిత్రాలు మిలియన్ క్లబ్బు చేరాయి. ఇక ఇప్పుడు ఖుషి సినిమాతో సమంత ఖాతాలో ఈ రికార్డ్ వచ్చి చేరిందనే చెప్పుకోవాలి. ఖుషి సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతుంది. మయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన సామ్.. సోషల్ మీడియా ద్వారా ఖుషి ప్రచార కార్యక్రమాలు చేస్తోంది.