పాన్ ఇండియా లెవెల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు కమల్. శంకర్ డైరెక్షన్లో రూపొందుతున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం కెహెచ్ 234 సినిమాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఇక ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చి సక్సస్ సాదించాయి. ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలయికలో మరో సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో కమలహాసన్ సరసన కథానాయకగా త్రిష నటించబోతుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకుముందు వీరిద్దరూ కలిసి తుంగావనం, మన్మధన్ అంబు సినిమాల్లో కలిసిన నటించారు. ఇక కథానాయకుడు దుల్కర్ సల్మాన్, తమిళ్ యాక్టర్ జయం రవి కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.