ఆ డైరెక్టర్ తో రిలేషన్ ను కన్ఫామ్ చేసిన జగతి మేడం.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!!

గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో రిషి తల్లిగా సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతోమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బుల్లితెరపై ఎంత సంప్రదాయంగా కనిపిస్తుందో సోషల్ మీడియా పోస్టుల్లో అందుకు అంతే భిన్నంగా దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటి. టీవీలో జనాలు చూసే జగతి మేడం వేరు సోషల్ మీడియాలో దర్శనమిచ్చే జ్యోతి రాయ్ వేరు.

కొంతకాలం నెట్టింట చిట్టి డ్రెస్లతో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఆ గ్లామర్ పిక్స్ షేర్ చేయడానికి గల కారణాన్ని కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే బుల్లితెరపై అల్లరిస్తున్న జ్యోతిరాయ్ ఇప్పుడు ఓటీటీలో ది ప్రిటి గ‌ర్ల్ వెబ్ సిరీస్‌తో సంద‌డి చేయ‌నుంది. ఇటీవల వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ నెట్టింట‌ తెగ వైరల్ అయింది. చాలా రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత విషయాలపై కూడా అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు ఉన్న జ్యోతి రాయి డైరెక్టర్ సుక్కుపూర్వాజ్‌తో క్లోజ్ గా ఉండడంతో పలు రకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దానికి తగ్గట్టుగా జ్యోతిరాయ్ కూడా వారిద్దరూ కలిసి క్లోజ్ గా ఉన్న పిక్స్ ను షేర్ చేసుకోవడంతో ఈ వార్తకు మరింత బలం వచ్చింది. ఇక తాజాగా ఈ వార్తలు పై క్లారిటీ ఇచ్చింది జ్యోతి. యంగ్ డైరెక్టర్ సుక్కుపూర్వజ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందంటూ అఫీషియల్ గా చెప్పేసింది. అత‌డితో కలిసి ఉన్న ఫొటోస్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ క్యాప్షన్ లో ఉంగరం గుర్తుతో పాటు లవ్ బర్డ్స్ లను పెట్టింది. దీనితో వీరికి నిశ్చితార్థం జరిగినట్లు కన్ఫామ్ అయ్యింది. ఇక త్వరలో వీరు వివాహం చేసుకోబోతున్నారట.