పవన్ కళ్యాణ్ ఓజీ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ భారీ యాక్షన్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్ ను ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వాటితో పాటే వచ్చిన హంగ్రీ చీతాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాక.. నార్మల్ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ స్టోరీ కి సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబై నగరానికి చెందిన సాధారణ వ్యక్తి ఒజాస్ గంభీర అనే టూరిస్ట్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్ స్ట‌ర్ గా ఎలా మారాడు.. అనంతరం అతని చర్యలతో కుటుంబాన్ని కోల్పోయి.. శత్రువులపై అతడు రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు.. అనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రముఖ ఇంటర్నెట్ రేటింగ్ సంస్థ ఐఎండిబి వారి పోర్టల్ లో షేర్ చేసుకుంది.

అయితే మరి ఈ కథ నిజంగా లేదా ఏదైనా మార్పు ఉంటుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా థ్రిల్ చేసే విధంగా ఎన్నో యాక్షన్ సన్నివేశాలు ఉండేలా దర్శకుడు సుజిత్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కాకపోతే మూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా మూవీ టీం ప్రయత్నిస్తున్నారట.