రెండు రోజుల్లో రూ. 200 కోట్లు.. రికార్డ్ బ్రేక్ చేసిన జవాన్..!

బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక అయిపోయిందిలే అనుకున్న సమయంలో పఠన్ సినిమాతో షారుక్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను చిత్తు చేశాడు. ఏకంగా వెయి కోట్ల ప్రాజెక్ట్ ను ఇండస్ట్రీకి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే పఠన్ సినిమా తనకు మాత్రమే కాకుండా బాలీవుడ్ కి కూడా ప్రాణం పోసింది.

ఇప్పుడు మరోసారి బాద్షా తన సత్తా చూపించాడు. ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్‌కి పరిచయం అయింది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో తెర‌కెక్కించిన తొలి సినిమా జ‌వాన్ కావ‌డం విశేషం. ఇక ఈ సినిమాసెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు సాధించి రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పఠన్ తరువాత జవాన్ కూడా వెయి కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.