ఆకట్టుకుంటున్న “టైగర్ నాగేశ్వరరావు ” సెకండ్ సాంగ్ ప్రోమో….. అసలు నిజం ఇదే….!!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. గాయత్రి భరద్వాజ్, నుపూర్ సనన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు”. ఈ మూవీని యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

 

స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు పెంచేసాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీ నుంచి వీడు అనే పల్లవి తో సాగే సెకండ్ సాంగ్ ని పలు భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సాంగ్ యొక్క ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ ని చంద్రబోస్ రచించారు. పవర్ఫుల్ లిరిక్స్ తో ఆకట్టుకునే ట్యూన్ తో సాగిన ఈ ప్రోమో.. అందరిలో సాంగ్ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరిచింది. ఈ మూవీ అక్టోబర్ 20న గ్రాండ్గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.