విర్రవీగితే అడ్రస్ లేకుండా పోతావు.. గౌతమ్ తల పొగరు దించిన శోభా శెట్టి..!!

ఉల్టా పుల్టా అంటూ ఈ బిబి సీజ‌న్‌7 కాస్త తేడాగానే సాగుతుంది. ముందు నాగార్జున చెప్పినట్టే చేస్తున్నారు. హౌస్ లో ఉన్న వారందరికీ కంటైనర్స్‌ టాస్కులు ఇస్తూ.. వాళ్లని బాగా కష్టపెడుతున్నారు. మొదటివారం సందీప్ పవర్అస్త్రా పొందగా.. రెండో వారం శివాజీ పొందాడు. ఇక మూడో వారం బిగ్ బాస్ నేరుగా కంటెండ‌ర్‌ షిప్ ని ముగ్గురికి ఇచ్చింది. వారు ఎవరంటే శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, అమర్దీప్. ప్రిన్స్, శోభా శెట్టి ప్రూవ్ చేసుకోగా.. అమర్దీప్ తాను ఇచ్చిన టాస్క్ ని చేయలేకపోవడంతో తన కంలెండ‌ర్‌ షిప్ కి ఛాలెంజ్ చేసిన ప్రియాంక అమర్ ప్లేస్ లోకి వచ్చింది.

శోభ కి ఛాలెంజ్ చేసిన.. గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్ తనతో పోటీ పడ్డారు. ముందుగా శోభా శెట్టి ని పిలిచి‌.. అతి కారమైన లెగ్ పీసులను మీరు ఎన్ని తింటే మీ కంటైనర్ షిప్ గురించి ఛాలెంజ్ చేసిన వారు అంతకన్నా ఎక్కువ తినాల్సి ఉంటుంది అని చెబుతాడు. శోభ 27 తింటుంది. గౌతమ్ 28 తినగా… సంచాలక్ వ్యవహరిస్తున్న సందీప్ కి చెప్పింది ఏమిటంటే… లెగ్ పీస్ లను పూర్తిగా తింటేనే లెక్కించమని బిగ్ బాస్ ఆదేశించాడు. దాన్ని బట్టి చూసుకుంటే గౌతమ్ కూడా 27 తిన్నట్లు… అందువల్ల శోభా శెట్టి నే విన్నర్ గా నిలిచింది.

ఆ తర్వాత అమర్దీప్ కి పోటీగా నిలబడిన ప్రియాంక కి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. అదేంటంటే.. జుట్టు కట్ చేసుకోమని చెప్పాడు బిగ్ బాస్. అబ్బాయి అయితే గుండు గీపిచ్చుకోవాలని… అమ్మాయి అయితే తన ఇయర్ వరకు కట్ చేసుకోవాలని ఫొటోస్ పంపాడు బిగ్ బాస్. ఈ టాస్క్ నుంచి అమర్దీప్ తప్పుకోగా ప్రియాంక తన జుట్టు త్యాగం చేసి ఈవారం కంటైనర్ షిప్ ని గెలుచుకుంది. కంటైనర్ షిప్ నుంచి అమర్దీప్ తప్పుకోగా… శోభా శెట్టి, ప్రిన్స్, ప్రియాంక తలపడనున్నారు. మరి పవరాస్త్ర ఎవరికి దక్కుతుందో చూడాల్సి ఉంది.