ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారల‌ను తింటే అంతే మ‌రి….వాటి బారిన పడినట్లే…!

మీరు మీ ఉదయం ఎలా ప్రారంభిస్తారో అలా రోజంతా మీ మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. అందువల్ల ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించండం చాలా ముఖ్యం. కొవ్వు, మసాలాలు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహం ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

అందుకే ఉదయం పూట సరైన మోతాదులో ప్రోటీన్స్, విటమిన్స్, క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ 5 ఆహారాలను ఉదయం పూట తీసుకోకపోవడమే మంచిది. మార్నింగ్ టైం లో కాఫీ తాగడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయాన్నే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ వినియోగం కార్టిసాల్ ను మరింత పెంచుతుంది. హార్మోన్లు పై ప్రభావం పడుతుంది. ఇది బీపీని పెంచుతుంది.

మీకు కాఫీ అలవాటు ఉంటే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తర్వాత తాగండి. కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచి ఆహారంగా పండ్ల రసాన్ని తాగుతారు. అయితే పండ్ల రసాలలో ఫైబర్ ఉంటుంది. అందుకే దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందువల్ల జ్యూస్ కు బదులుగా పండ్లను తీసుకోవచ్చు. నిమ్మరసం, దోసకాయ రసం కలిపి వీటిని ఖాళీ కడుపుతో తాగొచ్చు. ఆకలని నియంత్రించుకోవడానికి కొందరు ఉదయాన్నే పాన్కేక్లు తింటారు.

దీన్ని ఖాళీ కడుపుతో తింటే రోజంతా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాగే దాహం పెరుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగడం వల్ల కాఫీ కంటే ఎక్కువ హాని చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో చక్కెర, కెఫిన్, నికోటిన్ తీసుకోవడం మంచిది కాదు. ఇది ఎసిడిటీ, గుండెపోటు, రక్తంలో చక్కెర పెంచడం లాంటి సమస్యలని పెంచుతుంది.