బాలయ్య వల్లే నేను బతికున్నాను.. నటి అనిత చౌదరి సంచ‌ల‌న కామెంట్స్..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ మంచి మనసు గురించి చాలామంది ఇప్పటికే చాలా సందర్భాల్లో వివరిస్తూ ఉంటారు. ఆయనకు కోపం ఎక్కువైనా మనసు వెన్న లాంటిదని.. చిన్న పిల్లల మనస్తత్వం అని ఒకరిని అభిమానిస్తే వాళ్లని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల ఒకప్పటి మాజీ యాంకర్ ప్రముఖ నటి అనిత కూడా బాలయ్య గురించి ఇదేవిధంగా స్పందించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత‌ ఒకప్పుడు సుమా, ఝాన్సీ, శిల్ప, ఉదయభాను లాంటి టాప్ యాంకర్స్ తో పోటాపోటీగా బుల్లితెరపై యాంకర్‌గా రాణించింది.

ఇక అనిత త‌న జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ మొదటిసారి నేను అమెరికా వెళుతున్న టైం లో ఓ మేజర్ ఆక్సిడెంట్ జరిగిందని.. కస్తూరి సీరియల్ షూటింగ్ టైంలో నా నటనకు మెచ్చి సన్మానం చేసేందుకు ఇన్వైట్ చేశారని అప్పుడే కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ట్రక్ మా కార్‌ని ఢీ కొట్టిందని.. అప్పుడు నా కాలర్ బోన్ విరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డానని.. ఎలాగో కోలుకున్నాను అనుకుంటే కేరింత సినిమా టైంలో మరో పెద్ద యాక్సిడెంట్ చెవి చూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

యాక్సిడెంట్లో నా డిస్క్ విరిగిపోయిందని ఆ టైంలో ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని భావించానని.. కానీ బాలకృష్ణ గారు నాకు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారంటు చెప్పుకొచ్చింది. స్వయంగా హాస్పిటల్ కి వచ్చి తమ డాక్టర్ తో మాట్లాడి నాకు ట్రీట్మెంట్ చేయించారని నా అభిమాని బాలకృష్ణకు నా పరిస్థితి గురించి చెప్పారని దీంతో స్పందించిన బాలయ్య మా ఫ్యామిలీ మెంబర్స్‌తో, నా భర్తతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పార‌ని నాకు ట్రీట్మెంట్ చేయించార‌ని.. నిజంగా సాయం చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నాడు అంటు చెప్పుకొచ్చింది.

నాకు యాక్సిడెంట్ అయిన కొంతకాలం వరకు చాలామంది నా మీద జోక్స్ వేసుకున్నారని ఆ టైంలో డైరెక్టర్ కృష్ణవంశీ నాకు ధైర్యం చెప్పారు.. నా పక్కనే నిలిచారు అంటూ కృష్ణవంశీని ప్రశంసలతో ముంచెత్తింది. అలాగే కొన్ని కారణాల వల్ల నేను సినిమాల్లో క్యారెక్టర్స్ మిస్ చేసుకున్నాను అని చెప్పిన అనిత.. బొమ్మరిల్లు సినిమాలో శ్రావణి క్యారెక్టర్ ముందుగా తనకే అవకాశం వచ్చిందని.. అలాగే రీసెంట్‌గా వచ్చిన కార్తికేయ 2 లో కూడా ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక బాలయ్య‌ మంచితనం గురించి అనిత చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.