బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో అరుదైన గౌరవం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కు ఇటీవల ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. దీంతోపాటు సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది.

తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతుంది. బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కపోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్, మహేష్ తర్వాత ఈ ఘనత కేవలం అల్లు అర్జున్‌కే దక్కడం గమనార్హం. మేడం తోసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తారు నటి,నటులు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే స్థానం దక్కిన ఈ మ్యూజియంలో ఇటీవల సౌత్ స్టార్ హీరోలకు కూడా మెల్లమెల్లగా స్థానం లభిస్తుంది. టాలీవుడ్ హీరోలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో టాలీవుడ్ స్టార్స్‌కి కూడా స్థానం లభిస్తుంది.

ప్రభాస్, మహేష్ మైనపు విగ్రహాలు ఇప్పటికే ఆ మ్యూజియంలో ఉన్నాయి. ఇదే ఘనత అల్లు అర్జున్ కూడా దక్కిందట. ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడానికి బ‌న్ని త్వరలోనే లండన్ వెళుతున్నాడట. వచ్చే ఏడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన 3వ‌ హీరోగా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. దీంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇక పుష్ప 2.. సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షక ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.