సైక్లింగ్ చేస్తూ సేద తీరుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!?

సైక్లింగ్ చేస్తూ.. సేద తీరి సరస్సు అందాలను చూస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగులోనే కాదు తమిళ్‌లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా బీటౌన్‌లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం.


టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా..? ఓవైపు వ్యక్తిగత సమస్యలతో కృంగిపోయింది, మరోవైపు ఆరోగ్య సమస్యను కూడా ఎదుర్కొంటూ నిత్యం ఆ సమస్యతో పోరాడుతుంది.

గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతమైన లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు లెండి. ఎస్ తనే హీరోయిన్ సమంత. ఖుషి సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్ లో మంచి టాక్‌ అందుకుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్‌ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. రెండు సినిమాలు అనంతరం మూవీస్ కు బ్రేక్ తీసుకుంది.

ఇందుకు కారణం అందరికీ తెలిసిందే మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న శ్యామ్ కొన్ని నెలలు ఈ వ్యాధికి ఇంట్లోనే చికిత్స తీసుకుంది.. కాస్త కోలుకున్న తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఈ సమస్య మరింతగా ఇబ్బంది పెట్టడంతో చికిత్స కోసం అమెరికా వెళ్ళినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడాదికాలం అక్కడే సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇక తాజాగా శ్యామ్‌ సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)