ఇప్పటికైనా మారండి.. బాలయ్య బ్యూటీ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ముంబై బ్యూటీ వేదిక విజయదశమి మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన 3, బంగారు రాజు ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యతో కలిసి రూలర్ సినిమాలో మెప్పించింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్ లో సూపర్ హిట్ అందుకుంది. 2018లో ది బాడీ సినిమా ద్వారా బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకా జంగిల్ సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

అయితే మూగజీవులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉంటుంది. ఎప్పటినుంచో జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాడుతుంది. ఇటీవల జీ 20 సమ్మిట్ కోసం వీధి కుక్కలను అత్యంత క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక తాజాగా మరో వీడియోని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్‌ రాసింది. కోళ్లు, ఆవులు, మేకలు, పందుల మాంసం వెనుక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ.. ఫారంలో ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా మాంసం డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే.. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా.. జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపండి.

వెజిటేరియన్స్ గా మారిపోండి. ఇప్పుడైనా జంతువులను తినడం మానేయండి అంటూ రాసుకొచ్చింది. ప్లీజ్ రెస్పెక్ట్ అనిమల్స్ అని వితికా నోట్‌లో పేర్కొంది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతు తెలుపుతున్నారు. కానీ మరికొందరు మాత్రం మీరు వెజిటేరియన్ గా ఉంటే మంచిదే. అలా అని అందరూ అలా ఉండాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా జంతు హింస పట్ల వేదిక చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా కొంత మంచి జరిగిన చాలు అనే ఉద్దేశంతో ఆమె ఇలాంటి ట్విట్స్‌ చేస్తుందట.

 

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)