కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్.. సందీప్‌కి ఎసరు పెట్టిన మహాబలి టీమ్..!!

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ వారం పూర్తయిన ఈ షోలో రెండో వారం టాస్కులతో చాలా రసవతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో నామినేషన్ పాటుగా మాయ అస్త్ర తో బిగ్ బాస్ మరో కాంపిటీషన్ పెట్టాడు. హౌస్ మేట్స్ ని రణధీర, మహాబలి అని రెండు టీమ్స్ గా విభజించాడు. ఇందులో శివాజీ , అమర్దీప్‌, ప్రిన్స్, ప్రియాంక, శోభ శెట్టి, షకీలా గెలిచారు. దీంతో తాళం చెవిని సొంతం చేసుకున్నారు.

దీని దొంగతనం చేయాలని మహాబలి టీం ప్లాన్ చేస్తూ ఉంటారు. తాళం సంపాదించమని బిగ్ బాస్ చెప్పారు.. కానీ దొంగతనం చేయొద్దని చెప్పలేదు గా.. అని తేజ డౌట్ పడతాడు. అప్పుడు గౌతమ్ తాళం కొట్టేద్దామని అంటాడు అప్పటికే రాత్రి అయిపోవడంతో కంటెస్టెంట్స్ నిద్రపోకుండా కష్టపడ్డారు. మహాబలి టీం రతిక‌, శుభశ్రీ, గౌతమ్, తేజ, ప‌ల్ల‌వి ప్రశాంత్ మాత్రం రణధీర్ గ్రూప్ దగ్గర ఉన్న తాళాన్ని కొట్టేయడానికి రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు. ఈ నేపథ్యంలో యాక్టర్ శివాజీ.. శుభ శ్రీ‌ దగ్గరకు వచ్చి ఏమ్ యాక్టింగ్ చేస్తున్నావ్ అని అంటాడు.

ఇది జరిగిన తర్వాత దామిని, రతిక, శుభశ్రీ రాత్రంతా తాళం కోసం జాగారం చేశారు. కానీ తాళాలు దొంగిలించలేకపోయిన మ‌హబలి టీం సభ్యులు సందీప్ గెలుచుకున్న పవర్ అస్త్రాన్ని దొంగలించారు. అలాగే ఆ తాళం ప్రిన్స్ దగ్గర ఉందనే విషయం తెలిసి అతని మహాబలి టీం ఇబ్బంది పెడతారు. ఇక బిగ్ బాస్ పెట్టిన పోటీల్లో గెలిచిన రణధీర సమూహానికి బిగ్ బాస్ లో ఉన్న ఆరుగురికి పంచుకున్నారు. మీరు అందరూ కూడా పవర్ వస్త్ర పోటీలో ఉంటారని బిగ్ బాస్ మరోసారి చెప్పుకొచ్చాడు. దీంతో బుధవారం బిగ్ బాస్ షో ముగిసింది. మరి గురువారం ఎపిసోడ్లో ఏం జరగనుందో ఈ టాస్క్ లో ఏం చేస్తారో చూడాలి.