” బిగ్ బాస్ ” లో దారుణం.. రతికాపై చెయ్యి చేసుకున్న రైతు బిడ్డ..!!

నాగార్జున హోస్ట్ గా ఉన్న తెలుగు బిగ్ బాస్ హౌస్7 లో రతిక, ప్రశాంత్ మధ్య ఉన్న‌ క్లోజ్ నెస్ చూస్తూనే ఉన్నాం. కానీ రతిక.. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ప్రశాంత్‌తో కావాలని కెలిగించుకొని మరి గొడవలు పెట్టుకుంటుంది రతిక. అసలు వీరు ఎందుకు గొడవ పడతారో, ఎందుకు ద్వేషించుకుంటారో ఎవరికీ అర్థం కాదు.

అయితే తాజాగా హౌస్ లో మూడో వారంలో ఇమ్యూనిటీ గెలుచుకోవడం కోసం.. నేరుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమర్ దీప్, శోభ శెట్టి, ప్రియాంకాలను ఎంపిక చేశారు. అయితే వాళ్లు పవరస్త్ర అందుకోవడానికి అర్హులో కాదో.. కన్ఫెషన్ రూమ్ కు పిలిచి, ఇంటి సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాళ్లు ఏ కారణాలు అయితే చెప్పారో.. వాటిని బిగ్‌బాస్ తిరిగి వినిపించాడు. ఇక రైతు బిడ్డ అయితే బిగ్ బాస్ తనని ఎంపిక చేయకపోవడం వల్ల తెగ ఫీల్ అయ్యాడు. బిగ్ బాస్ మనసులో ఓడిపోయానంటూ ఏడవడం ప్రారంభించాడు.

ఆ తర్వాత ఒక్కొక్కరు.. నామినేషన్స్ లో మాదిరే ఏదో ఒక కారణాలు చెప్పారు. దామిని ఏదో మాస్టర్ మైండ్స్ అన్నట్టుగా.. ప్రిన్స్ కి లేదని… చెప్పి అనర్హుడుగా ప్రకటించింది. ఇక ఈ క్రమంలో రతిక, ప్రశాంత్ మధ్య గొడవ మొదలయ్యింది. ” నీకు ఎన్ని సార్లు చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని రతిక అనగా.. నువ్వే షో అంటూ ప్రశాంత్ ఆమెను చేత్తో తాకి చెప్పే ప్రయత్నం చేశాడు. చెయ్యస్తే బాగోదని అతడికి రతిక వార్నింగ్ ఇచ్చింది”. కాసేపు అతనితో మంచిగా ఉంటున్న రతిక మరి కాసేపు రివర్స్ అవుతుంది. రతిక ప్రవర్తన ఎవరికి అర్థం కావడం లేదు.