కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాతో చెక్‌..!

ప్రస్తుతం ఇప్పుడు చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. నీరు సరిగ్గా తాగకపోవడం అయితే.. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడానికి మరో కారణం అవుతాయి. సాధారణంగా ఈ సమస్య ఎదురైనప్పుడు వైద్యులు పరీక్షించి.. రాళ్లు చిన్నగా ఉన్నట్లయితే మందులు ఇస్తారు. లేదంటే శాస్త్ర చికిత్స వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఆయుర్వేద చిట్కాలను కూడా ఉపయోగించి.. కీడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చు. ఇవి నేచురల్ గా దొరికే వాటితో చేస్తారు కాబట్టి ఈ చిట్కాలు వాడిన ఏ సమస్యలు ఉండవు. మరి ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటో
ఇప్పుడు తెలుసుకుందాం.

రణపాల ఆకు:
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవడంలో రణపాల ఆకు ఎంతగానో సహాయపడుతుంది. గుప్పెడు రణపాల ఆకులతో పాటు మూడు మిరియాలు, మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోట్లో వేసుకొని మెత్తగా దంచాలి. ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి రసాన్ని తీసి.. ఇలా తయారు చేసుకున్న రసాన్ని 50 ఎమ్ఎల్ మొత్తంలో రోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల 50 నుంచి 20 రోజుల్లోనే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

కొండపిండి ఆకు:
కొండపిండి ఆకుతో కూడా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలే వస్తాయి. ఆకు ను వేర్లతో సహా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని దంచి గిన్నెలో వేసి లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఈ లీటర్ నీరు పావు లీటర్ ఆయ్యే వరకు బాగా మరిగించి వడకట్టాలి. నెక్స్ట్ ఈ నీటిలో పటిక బెల్లం వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా ఈ ఆకు కషాయాన్ని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.

అరటి చెట్టు:
అరటి చెట్టు లోపల ఉండే బలం కూడా కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గిస్తుంది. ఈ భాగం నుంచి రసాన్ని తీసుకుని రోజు తగిన మోతాదులో తాగుతూ ఉంటే రాళ్లు సమస్య నుంచి బయటపడవచ్చు.

పల్లేరు కాయ:
పల్లేరు కాయ తీగతో కూడా ఈ సమస్యను నయం చేయవచ్చు. ఈ తీగను దంచి నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఈ నీటిని పరగడుపున తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు సమస్యలు నయమవుతాయి.