” మార్క్ ఆంటోనీ ” సినిమాపై.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్….!!

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా.. వెర్సటైల్ నటుడు,దర్శకుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ టీమ్‌ ట్రావెల్ పిరియాడిక్ గ్యాంగ్ స్టార్ డ్రామా ” మార్క్ ఆంటోనీ “. దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తర్వాత అయితే మంచి బజ్ ని తెచ్చుకుంది.

ఇక ఈ వినాయక చవితికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఇప్పుడు అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో జె ఆర్ సి కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో అయితే నితిన్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అని మేకర్స్ అనౌన్స్ చేశారు.

దీంతో సినిమా రిలీజ్ డేట్ పట్ల వస్తున్నా వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదు అని.. అనుకున్న డేట్ కి సినిమా థియేటర్లో రెండు భాషల్లో రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది.