బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఊహించ‌ని ట్విస్ట్.. లెక్క మారనుందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు పుష్ప సినిమాతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ పేరే వినిపిస్తుంది. ఇటీవల పుష్ప సినిమా నటనకు గాను నేషనల్ అవార్డులు దక్కించుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.

వచ్చేఏడాది ఆగస్టు 15 సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ భారీ మూవీ చేయనున్నట్లు అల్లు అర్జున్ ఇటీవల అనౌన్స్ చేశాడు. ఈ మూవీని గీత ఆర్ట్స్ హారిక హాసన్ క్రియేషన్స్ సంస్థలో భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది. అయితే లేటెస్ట్ బజ్ ప్ర‌కారం ఇటీవల జవాన్‌తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అట్లీ – అల్లు అర్జున్ కు ఒక అద్భుతమైన స్టోరీను వినిపించాడట‌.

అది బ‌న్నికి చాలా నచ్చడంతో ఆ స్టోరీ పూర్తిగా సిద్ధం చేస్తే మూవీ చేసేద్దాం అని అల్లు అర్జున్ చెప్పాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. కాకపోతే పుష్పా 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీతోనే సినిమా చేయబోతున్నాడని.. అల్లు అర్జున్ 22వ సినిమాగా ఇది రూపోతుందని అట్లీతో.. అల్లు అర్జున్ సినిమా అయిన తరువాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌ పైకి వస్తుందని టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ న్యూస్ పై అఫీషియల్ ప్రకటన రాలేదు.