ఫిల్మ్ ఫెస్టివల్లో అవతార్ తో పోటీపడుతున్న బలగం….!!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాలలో బలగం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం… దిల్ రాజ్ సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్స్ పై హర్షిత్ మరియు హన్షిత నిర్మించారు.

ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డును సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతో బలగం పోటీ పడుతుంది. ఈ సినిమా ‘ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్ ‘ విభాగంలో నామినేషన్ పొందింది.

ఈ ఫెస్టివల్ లో 82 దేశాల నుంచి 1,072 సినిమాలు వివిధ‌ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 14న క్రొయేషియాలో జరిగే ఈవెంట్‌లో విజేతలను ప్రకటిస్తారు. తెలుగు ప్రజలంతా బలగం సినిమాకి అవార్డ్ రావాలని కోరుకుంటున్నారు. మరి అవార్డు ఎవరికి సొంతమవుతుందో చూడాల్సి ఉంది.