పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సలార్ మూవీపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో యూఎస్ లో ఊహించని రేంజ్ లో భారత సినిమా నుంచి నెవర్ బిఫోర్ రేంజ్ లో థియేటర్స్కు రిలీజ్ ఇస్తున్నారు.
అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈనెల ఆగస్టు 25 నుంచి టికెట్స్ బుకింగ్ అందుబాటులోకి తెస్తామని చెప్పినా.. బిగ్ సర్ప్రైజ్ ను ఇచ్చారు. ఈ సినిమా బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. దీంతో మొదలైన ఈ సినిమా బుకింగ్స్ భారీ రేంజ్లో నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సర్ప్రైజింగ్గా సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయినా గంటలోనే లక్ష డాలర్స్కి దగ్గరగా బుకింగ్స్ జరిగాయట. దీన్నిబట్టి ప్రభాస్ రాజు మ్యానియా ఏ రేంజ్లో ఉందో చెప్పవచ్చు.