మ‌హేష్‌బాబు అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లా… 50 ఏళ్ల వ‌య‌స్సులోనా…?

సీనియర్ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె స్పందించింది. 50 వయసులో ఉన్న తనకు మరో పెళ్ళా అంటూ ఒక్కసారిగా ఆమె షాక్ అవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించింది. 1991 లో ప్రముఖ దర్శకుడు భారతీరాజ్ దర్శకత్వం వహించిన “పుదు నెల్లు పుదు నాత్తు” అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది సుకన్య.

ఆ తర్వాత మహానది, చిన్న గౌండర్, వాల్టర్ వెట్రివేల్, ఇండియన్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె తెలుసు. పెద్దరికం, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు లాంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఇక ఇటీవల మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో మెప్పించింది. ఆమెకు 2002 లో శ్రీధరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. కానీ ఏడాది తిరక్క ముందే విడాకులు తీసుకున్న సుకన్య.. స్వదేశానికి వచ్చి అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఈమె మరో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సుకన్య స్పందించింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇప్పటివరకు అలాంటి ఆలోచన నాకు లేదు.. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఇకపై పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ పోతే.. నాకు పుట్టిన పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా? అనే ఆలోచన నా మదిలో మెదులుతోంది”అని అన్నారు. అయినా ఆమె మరో పెళ్లి వద్దని కానీ, కావాలని కానీ చెప్పలేదు.