గుండుతో ఉన్న ఈ మ‌ల్టీ టాలెంటెడ్ టాలీవుడ్‌ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా…!

ఫోటోలో గుండుతో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలియాల్, కన్నడ భాషల్లోనూ హీరోయిన్గా నటించింది. కొరియాగ్రాఫర్ గా ఎక్కువ సినిమాలు చేసిన ఈమె దర్శక, నిర్మాతగానూ పనిచేసింది. మధ్యలో తమిళ్ బిగ్ బాస్ షో లోను పాల్గొంది. ఆమె చివరగా 2021లో వచ్చిన ‘ రంగ్‌దే ‘ చిత్రంలో హీరో సోదరీగా నటించింది. ఆవిడ మరెవరో కాదు గాయత్రి రఘురామ్.

రేపల్లెలో రాధ 2001 అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ తనకు పాపులారిటీ తెచ్చి పెట్టింది మాత్రం ‘ మా బాపు బొమ్మకు పెళ్ళంట ‘ సినిమా. ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈమెకి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులోని “మాటలేరాని వేళ్ల పాట ఎలా పాడను..” సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఎవరైనా తీవ్ర బాధలో కూర్చుని ఉంటే ఇప్పటికీ ఈ పాట వింటూ ఉంటారు. ఇందులో తన నటనతో కన్నీళ్లు పెట్టించిన గాయత్రి అప్పటికే సౌత్ లో అనేక భాషల్లో నటించింది. పాపులారిటీ సంపాదించిle 2004 నుంచి 2010 వరకు ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ తర్వాత కొన్ని ప్రత్యేక పాత్రల్లో ఓ మెరుపు తీగల కనిపించి వెళ్ళిపోయింది. సహాయక పాత్రల్లోనూ నటించింది. హీరోయిన్ గా కంటే కొరియోగ్రాఫర్ గానే ఎక్కువ సినిమాలు చేసింది. రంగ్‌దే రిలీజ్ తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని చెప్పొచ్చు. 2006లో దీపక్ చంద్రశేఖర్‌ను పెళ్లాడిన ఈమె 2010 లో విడాకులు తీసుకుంది. 2014లో బీజేపీలో చేరగా ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. ఈ హీరోయిన్ ఆగస్టు నెల ప్రారంభంలో తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంది. ఆ సమయంలోనే స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలోనే గుండుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Gayathri Raguramm (@gayathriraguramm)