రెండు నెలల క్రితం వివాహమైన యువతి భర్త స్నేహితుడితో పరారైన ఘటన బెంగళూరులో జరిగింది. రాజరాజేశ్వరీనగరకు చెందిన రమేశ్ కు రెండు నెలల క్రితం ఓ యువతితో పెళైంది. కొత్త సంసారం సాఫీగా సాగుతుంది. అయితే ఈ నెల 12న ఉదయం రమేష్ స్నానం చేయడానికి వెళ్ళాడు.
ఇంతలో నవ వధువు బట్టలు, డబ్బులు సర్దుకుని బాత్ రూమ్ , ఇంటికి తాళం వేసుకుని స్నేహితుడితో కలిసి వెళ్లిపోయింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన రమేష్ జరిగిన విషయాన్ని ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు కార్తీక్ తో వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.