బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా… ఉత్తర కోస్తా, యానంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పల్నాడు, తూర్పుగోదావరి, కృష్ణ, కాకినాడ జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ఏపీఎస్ డిపిఎస్ వెబ్సైట్ ప్రకారం రాత్రి 7 గంటల వరకు గుంటూరు జిల్లా రావెల ప్రాంతంల్లో అత్యధికంగా 8 సీం.మీ. వర్షపాతం సంభవిస్తుంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3రోజుల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇళ్ళ నుంచి బయటికి రాకూడదని తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమై.. ముందస్తు చర్యలు చేపట్టింది.