” ఎందుకు ఆ గాయం…. వదల మంది ప్రాణం ” … మ‌న‌సు దోచేసిన స‌మంత – విజ‌య్ ( వీడియో )

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తరికెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా నాలుగో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

“ఎందుకు ఒక గాయం…. వదల మంది ప్రాణం”అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రిలీజ్ చేసిన అరగంట లోనే 110k వ్యూస్ సాధించింది. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ను ఈ సాంగ్ బీట్ చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇటీవల ఖుషి టీమ్ జరుపుకున్న మ్యూజిక్ కాన్సెర్ట్ ఈ సినిమా ప్ర‌మెష‌న్స్‌కి హైలెట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైం లో ఈ సినిమాకు సంబంధించిన నాలుగో పాట రిలీజ్ కావడంతో ప్రేక్షకులను ఈ పాట బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.