రియ‌ల్‌స్టార్ శ్రీహ‌రి చ‌నిపోయేముందు ఇంత ఘోరం జ‌రిగిందా…!

శ్రీహరి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా ఎన్నో పాత్రలో నటించి చాలామంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే క్యాన్సర్ భారిన పడి శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధించింది. ఇక తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆయన మరణానికి సంబంధించి.. తమ పర్సనల్ లైఫ్ గురించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. శ్రీహరి చనిపోయే ముందు ముక్కు, చెవి, కళ్ళ నుంచి రక్తం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

నేను మాట్లాడుతుండగానే కళ్ళు మూసుకొని పోయాయని డిస్కో శాంతి వివరించింది. శ్రీహరి గారికి ఒక తప్పుడు ఇంజక్షన్ ఇచ్చారని ఆ ఇంజక్షన్ తర్వాతే ఇటువంటి సమస్యలన్నీ మొదలయ్యాయి అంటూ చెప్పుకొచ్చిన డిస్కో శాంతి.. శ్రీహరి ఆస్తులు విషయంలో కూడా మాకు చాలా మోసం జరిగిందని చివరకు నా బంగారం కూడా తాకట్టు పుట్టానని ఆమె కామెంట్ చేసింది. బావ చనిపోయిన తర్వాత తాగుడుకు బానిస అయ్యాన‌ని డిస్కో శాంతి పేర్కొంది. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని.. శ్రీహరి గారు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నారని ఆయన గుర్తుకు రాకుండా ఉండడానికి నేను ఇప్పటికీ మద్యం తాగుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

శ్రీహరి నటించిన సినిమాల్లో భద్రాచలం, విజయరామరాజు సినిమాలు నాకు చాలా ఇష్టం అంటూ వివరించిన‌ డిస్కో శాంతి ఆయన బతికి ఉంటే ఇంట్లో హడావిడి వేరేగా ఉండేదని శ్రీహరికి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇక తాజాగా డిస్కో శాంతి తమ పిల్లలు జైల‌ర్ సినిమాను చూశారని.. నా కొడుకు స్నేహితులు ఇంటికి వస్తుంటే ఆనందంగా ఉంటుందని వివరించింది. శ్రీహరి జ్ఞాపకాలు ఎప్పటికీ నన్ను వదలవని ఆమె ఎమోషనల్ అయింది. శ్రీహరి చనిపోయిన మూడు సంవత్సరాల వరకు ఆమె తాళి కూడా తీయలేదట.