బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ఈటీవీ పటాస్ షో తో ఇండస్ట్రీకి పరిచయమైంది. తరువాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన శ్రీముఖి ఈ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఓ పక్క టీవీ షోలలో బిజీగా గడుపుతూనే మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఇటీవల శ్రీముఖి యాంకరింగ్ చేసిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈషోలో స్టార్ మా కి సంబంధించిన సీరియల్స్ హీరో హీరోయిన్లు అందరూ హాజరయ్యారు.
ఇందులో భాగంగా గుప్పెడంత మనసు హీరో ముఖేష్, హీరోయిన్ రక్ష కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. శ్రీముఖి ఈ సెట్స్ లో నేను ఒకరిపై అలిగాను అంటూ ముఖేష్ ను ఉద్దేశించి మాట్లాడుతుంది. ముఖేష్ దానికి స్పందిస్తూ నా మనసులో మొత్తం మీరే ఉన్నారు శ్రీముఖి. అప్పుడప్పుడు బోర్ కట్టినప్పుడు అలా రక్ష గుర్తుకొస్తుంది అనడంతో వెంటనే శ్రీముఖి సిగ్గుపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram