77వ స్వాతంత్ర్య వేడుకలను దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సినీ తారలు సైతం చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కు నివాళి అర్పించారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా తన నివాసంలో ఇద్దరు కుమారులతో కలిసి జెండాను ఎగరవేసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. కొందరు నెటిజన్లును శిల్పాను ట్రోల్ చేయడం షురూ చేశారు. చెప్పులేసుకుని శిల్పా శెట్టి జెండా ఎగరవేయడమే అందుకు కారణం. అయితే ఈ సారి శిల్పా శెట్టి సైలెంట్ గా ఉండలేదు.
విమర్శకులకు చెప్పు తెగేలా అన్సర్ ఇచ్చింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని శిల్ప స్పష్టం చేసింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్లో ఎక్కడా లేదని ఆమె పేర్కొంది. తన వాదనకు బలం చేకూర్చేలా గూగుల్లో ఓ ఆర్టికల్ను వెతికి మరీ నెట్టింట షేర్ చేసింది. ఎలాంటి అవగాహన లేకుండా పనిగట్టుకుని మరీ ట్రోల్ చేసే నెటిజన్ల నోరు మూయించింది.