మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణాలు అవే.. ఊర్వశి సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ఊర్వశి. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కి, ఎక్స్ప్రెషన్స్ తో నవ్వించగల ఎన్నో పాత్రలకు పెట్టింది పేరుగా ఊర్వశి గుర్తింపు తెచ్చుకుంది. అసలు పేరు కవిత రంజని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట ముందమై ముడిచు అనే తమిళ సినిమాలో హీరోయిన్గా పరిచయమైన ఈమె కొంతకాలం పాటు హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెట్ ఆర్టిస్ట్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 700 పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది.ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో నటుడు మనోజ్ కేజయ్యాన్‌ని 2000లో వివాహం చేసుకుంది.

వీరిద్ద‌రికి తేజా లక్ష్మీ అనే పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన కొంతకాలానికే 2008లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నై వాసి శివప్రసాద్ పెళ్లాడిన ఊర్వశి ఇషాన్ ప్రజాపతి అనే అబ్బాయికి జన్మనిచ్చింది. అటు మనోజ్ కూడా మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి మొదటి పెళ్లి గురించి విడాకుల కారణాల గురించి వివరించింది. మనోజ్ నేను విడిపోవడానికి ఒకటే కారణం తాగుడు అలవాటు. అతడు ఇంట్లో అందరూ మందు తాగుతారు కుటుంబం అంతా కలిసి తాగుతారు.. నన్ను కూడా తాగమని బలవంతం చేసేవాడు.. రోజు తాగి నేను కూడా తాగుబోతుల తయారయ్యాను అంటు వివ‌రించింది.

అతడి వల్లే నేను మందుకు బానిస అయ్యాను.. అదే మావిడాకులకు కారణమైంది నా కూతుర్ని కూడా నాకు దక్కకుండా చేశాడు. నేను ముందుకు బానిస అయ్యాన‌నే కారణంతో కూతురి బాధ్యతలను తానే తీసుకున్నాడు. ఒంటరి దానై డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. చాలా కాలం నాలో నేనే కృంగిపోయా. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ శివప్రసాద్‌తో నాకు రెండో పెళ్లి జరిగింది. అప్పుడు నా వయసు 40 ఏళ్ళు ఆ వయసు ఆ వయసులో పెళ్లి చేసుకోవడం అంత అవసరమా అంటూ చాలామంది విమర్శించారు. కానీ నేను వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు నా భర్త కొడుకుతో సంతోషంగా ఉంటున్నానని వివరించింది ఊర్వశి.