సాయి పల్లవితో రణ్‌బీర్.. అలియా భట్‌కు బిగ్ షాక్ ..!!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి నటించినది కొన్ని సినిమాలైనా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన క్రేజ్‌తో లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గత కొంతకాలంగా టాలీవుడ్‌లో కనిపించడం లేదు. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో మెరిసింది. ఈ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతుందట.

ఇప్పటికే సినిమాలో రామ్‌గా రణ్‌బీర్ కపూర్‌ని సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ నితీష్. ఇక సీతాదేవి పాత్రలో అలియా భట్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అలియా ఈ సినిమా నుంచి తప్పుకుందని సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే సాయి పల్లవిని మూవీ టీం కలిసినట్లు సాయి పల్లవి కూడా ఈ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి.

ఇక ఈ రామాయణం షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆలియాభట్ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. ఈ సినిమాని నితీష్ 3 భాగాలుగా సిద్ధం చేస్తున్నాడట. కేజీఎఫ్ ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో యష్ ను ఈ సినిమాలో రావణుడి పాత్ర‌లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. హనుమంతుడు పాత్రలో ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సాయి పల్లవి సీత పాత్రలో నటించడం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇక హనుమంతుడు పాత్రలో ఎవరు నటిస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.