19 ఏళ్ల తర్వాత మహేష్‌తో ఆ స్టార్ హీరోయిన్‌…!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తో కలిసి రమ్యకృష్ణ నటిస్తోంది. రజనీకాంత్ జైలర్ మూవీలో కీరోల్‌ ప్లే చేసిన రమ్యకృష్ణ గుంటూరు కాలంలోనూ ఓ కీలక పాత్ర లో నటించబోతుందట.

19 సంవత్సరాల క్రితం విడుదలైన నాని లో తొలిసారిగా రమ్యకృష్ణ – మహేష్ బాబు కలిసి తెరపై కనిపించారు. మరోసారి ఇన్ని సంవత్సరాల గ్యాప్‌తో మహేష్ – రమ్యకృష్ణ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం వెకేష‌న్ ఎంజాయ్ చేసి వ‌చ్చిన మహేష్ బాబు మళ్లీ సెట్స్‌ పైకి రావడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు థ‌మన్ సంగీత బాధ్యతలు తీసుకున్నారు. జనవరి 12, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.