అనుష్క చేసిన ప‌నికి ప్ర‌భాస్‌కు న‌వ్వు ఆగ‌లేదా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మూవీ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు.పి డైరెక్షన్లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపొందించబడింది. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైల‌ర్‌ రిలీజ్ అయిన కొంతసేపటికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించింది.

కామెడీ ఎంటర్టైనర్ గా నవ్వులు పోయించిన ఈ ట్రైలర్ పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని ప్రేమించిన.. ఒక అబ్బాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు పెళ్లి వద్దు పిల్లలు మాత్రమే కావాలి అన్న హీరోయిన్ తో.. హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించారు. ఈ సినిమా ట్రైలర్ పై ఇటీవల పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా స్పందించాడు. ప్రభాస్, అనుష్క మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రభాస్ అన్న ప్రమోద్ కావడంతో సినిమా ట్రైలర్‌ని ప్రభాస్ వెంటనే చూసి స్పందించాడు.

ఇక ప్రభాస్ ట్రైలర్ పై ఇచ్చిన రివ్యూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రైలర్ చూసినంత సేపు నేను నవ్వు ఆపుకోలేకపోయాను.. స్వీటీ అండ్ నవీన్ మీరిద్దరూ అద్భుతంగా చేశారు.. సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మూవీ టీమ్‌కి నా బెస్ట్ విషెస్ అంటూ రాసుకొచ్చాడు. ఇక దీన్ని యు వి క్రియేషన్స్ పోస్ట్ చేస్తూ.. థాంక్స్ ప్రభాస్ గారు మీరు మాతో కలిసి నవ్వి మా ఎనర్జీకి బూస్టింగ్ ఇచ్చినందుకు అంటూ టాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్‌ వైరల్ గా మారింది. ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల్లో కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.