ఆ ఒక్క హీరో కోసం ఫ‌స్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన న‌య‌న‌తార‌… ఏంటి అంత స్పెష‌ల్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కూల్ అండ్ కామ్ హీరోగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. షూటింగ్ లేని టైంలో తనకు ఇష్టమైన బైక్ రేసింగ్, రైఫిల్‌ షూట్ లాంటి వాటిపై ఆసక్తి చూపుతూ ఉంటాడు. సినిమాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో గాని, ప్రమోషన్ ఈవెంట్లో గాని అజిత్ కుమార్ పాల్గొనుడు. ఈ విషయాన్ని ముందుగా నిర్మాతలకు మెన్షన్ చేస్తాడు. అది అజిత్ పాలసీ. అందుకు నచ్చితేనే ఆయనతో సినిమాలు చేస్తూ ఉంటారు దర్శక, నిర్మాతలు. దాదాపు ఇదే రూట్‌లో నాయనతార కూడా వెళ్తుంది.

కెరీర్ మొద‌టిలో కొన్ని సినిమా ఈవెంట్లలో పాల్గొన్న నయనతార స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న తర్వాత తన భర్త విగ్నేష్ శివ‌న్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు తన ఓన్ బ్యానర్ పై నిర్మించిన సినిమాల ప్రమోషన్లలో మాత్రమే పాల్గొంటుంది. ఈ విధంగా నిర్మాతలకు నచ్చకపోయినా సరే ఆమెకు ఉన్న క్రేజ్‌ కారణంగా సినిమాలు తీస్తున్నారు. ఇకపోతే నయనతార తన మొదటి బాలీవుడ్ సినిమా జవాన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ రోల్‌ప్లే చేస్తున్నారు.

యోగి బాబు కీరోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయనతార పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. నటించిన దాదాపు ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని నయనతార ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలియడంతో షారుక్ ఖాన్ కోసం ప్రస్తుతం నయనతార తన పాలసీని బ్రేక్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరుల్‌ అవుతుంది.