పవిత్ర – నరేష్ పెళ్లిపై న‌రేష్ కొడుకు కామెంట్స్ వైర‌ల్‌.. ఫిల్మ్ నగర్‌ అదే హాట్ టాపిక్..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి రిలేషన్ గురించి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రమే రియాక్ట్ అయ్యింది కానీ… కుటుంబ సభ్యులు ఎవరు మీడియా ముందు స్పందించలేదు. తాజాగా నరేష్ కొడుకు నవీన్ వీళ్ల రిలేషన్ పై కామెంట్స్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘సత్య’. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది.

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ను … నరేష్, పవిత్ర రిలేషన్ గురించి మీరు ఏం అనుకుంటున్నారని ప్రశ్న ఎదురయింది. దానికి స్పందించిన నవీన్.. వాళ్లు మాత్రమే అలా చేయలేదు. బయట చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో సోషల్ మెసేజ్ ఏం లేదు. జీవితం ఉన్నంత వరకు ప్రశాంతంగా, ఆనందంగా బతకడమే ఎవరి లక్ష్యం అయినా… ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేము.

 

మా నాయనమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎప్పుడూ చెప్పలేదు. మాకు నచ్చినట్లు బతకమని ఫ్రీడమ్ ఇచ్చింది. అదే నాన్న ఫాలో అవుతున్నారు. నా పెళ్లి కూడా నా ఇష్ట ప్రకారంగా చేసుకోమన్నారు. ఆయన వచ్చి అక్షింతలు వేసి వెళ్తా అని చెప్పారు. అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు నవీన్. ప్రస్తుతం నవీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.