నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్త.. మోక్షజ్ఞ- ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్..!

నందమూరి అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం… బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య తోటి నటులు చిరంజీవి, నాగార్జున వారసులు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం అప్పుడు, ఇప్పుడు అంటూ వార్తలు తప్ప సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం లేదు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ వినిపిస్తుంది.

మోక్షజ్ఞ సినీ హీరోగా ఎంట్రీకీ ముహూర్తం ఫిక్స్ అయింది. అది కూడా మల్టీ స్టార్ సినిమాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కాంబినేషన్లో ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నందమూరి బ్రదర్స్ సినిమాకి మరో బ్రదర్ కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని ఇండస్ట్రీలో టాక్. ఇతర హీరోల ఎంట్రీలా కాకుండా… కాస్త డిఫరెంట్ గా మోక్షజ్ఞ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారట.

 

సోలో హీరోగా కాకుండా మొదటి సినిమానే మల్టీ స్టార్ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలి చిత్రంలో నటించాలని మోక్షజ్ఞ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. గ్గోబ‌ల్ లెవ‌ల్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ పక్కన నటించి, తన ప్రత్యేకత చాటుకోవాలని మోక్షజ్ఞ భావిస్తున్నాడు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మ‌రింది. జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ మూవీ కి నిర్మాతగా నందమూరి కల్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సొంత బ్యానర్ లోనే తొలి సినిమా చేయడంతో పాటు తన కుటుంబంలో ఇతర నటులతోనే ఎంట్రీ ఇవ్వాలని మోక్షజ్ఞ అనుకున్నాడట. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లిన తెలుగు సినిమా రంగంలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ తొలి సినిమాను ఒక మాతృభాషకే పరిమితం చేస్తారా? పలు భాషల్లో విడుదల చేస్తారా అనేదే క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్, మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే చిత్రంపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.